బ్రేకింగ్: తెలంగాణలో కొత్తగా 1,296 కేసులు, 6 మరణాలు..

Coronavirus Positive Cases Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,296 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. హైదరాబాద్‌లో 557 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,076కి చేరింది. ఇందులో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,831 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తంగా 32,438 మంది ఇప్పటివరకు వైరస్ […]

బ్రేకింగ్: తెలంగాణలో కొత్తగా 1,296 కేసులు, 6 మరణాలు..

Updated on: Jul 19, 2020 | 10:05 PM

Coronavirus Positive Cases Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,296 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. హైదరాబాద్‌లో 557 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,076కి చేరింది. ఇందులో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,831 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తంగా 32,438 మంది ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ 6 మంది కరోనాతో మృతిచెందగా.. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 415కి చేరింది. కాగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 12, 519 టెస్టులు చేశారు.

ఇక జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 557 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 111, మేడ్చల్ జిల్లాలో 87, సంగారెడ్డిలో 28, ఖమ్మంలో 5, కామారెడ్డిలో 67, వరంగల్ అర్బన్‌లో 117, వరంగల్ రూరల్ 41, నిర్మల్ 1, కరీంనగర్‌లో 27, జగిత్యాల 11, యాదాద్రిలో 15, మహబూబ్ నగర్ 6, పెద్దపల్లిలో 29, మెదక్‌లో 29, మంచిర్యాలలో 1, మహబూబాబాద్ 21, నల్గొండలో 26, రాజన్న సిరిసిల్లలో 19, ఆదిలాబాద్‌లో 15, ఆసిఫాబాద్ 1, నాగర్‌కర్నూలు జిల్లాలో 13, వికారాబాద్ జిల్లాలో 1, జనగాం జిల్లాలో 5, నిజామాబాద్ జిల్లాలో 24, వనపర్తి జిల్లాలో 7, సిద్దిపేట జిల్లాలో 10, సూర్యాపేట జిల్లాలో 16, గద్వాల జిల్లాలో 4, ములుగులో 2 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..

సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..

2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..