AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus AP: ఏపీలో తగ్గుతున్న పాజిటివ్ కేసులు, మరణాలు.. పెరుగుతున్న రికవరీ శాతం..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 630 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,71,305కి చేరింది.

Coronavirus AP: ఏపీలో తగ్గుతున్న పాజిటివ్ కేసులు, మరణాలు.. పెరుగుతున్న రికవరీ శాతం..
corona-ap
Ravi Kiran
|

Updated on: Dec 05, 2020 | 8:43 PM

Share

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 630 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,71,305కి చేరింది. ఇందులో 6166 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,58,115 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 3 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 7,024కు చేరుకుంది. ఇక నిన్న 882 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,03,50,283 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 29, చిత్తూరు 89, తూర్పుగోదావరి 64, గుంటూరు 85, కడప 28, కృష్ణా 97, కర్నూలు 5, నెల్లూరు 32, ప్రకాశం 35, శ్రీకాకుళం 12, విశాఖపట్నం 40, విజయనగరం 24, పశ్చిమ గోదావరి 90 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.