కరోనా మరణాలు.. ఆ వయస్సువారికే అధిక ముప్పు..!

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఇదే సమయంలో రికవరీ శాతం కూడా పెరుగుతుండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం.

కరోనా మరణాలు.. ఆ వయస్సువారికే అధిక ముప్పు..!

Updated on: Aug 27, 2020 | 12:13 AM

Coronavirus Deaths: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఇదే సమయంలో రికవరీ శాతం కూడా పెరుగుతుండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం. అంతేకాకుండా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాలు తక్కువగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

భారత్‌లో ఇవాళ ఒక్క రోజే 1059 మంది కరోనాతో మరణించారు. దీనితో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య  59,449కి చేరింది. ఈ మృతుల్లో పురుషులు 69 శాతం మంది ఉండగా.. మహిళలు 31 శాతం మంది ఉన్నారు. దేశంలో ప్రస్తుతం డెత్ రేట్ 1.84 శాతంలో ఉంది. ఇక వయస్సు పరంగా గణాంకాలు చూసుకుంటే.. ముఖ్యంగా ఈ వైరస్ 60 ఏళ్లు పైబడిన వారిపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. వారికి దీర్ఘకాలిక రోగాలు ఉండటంతోనే కరోనా ముప్పు ఎక్కువ ఉంటుందంటున్నారు.

కరోనా మృతుల్లో 60 ఏళ్లు పైబడిన వారు 51 శాతం మంది ఉన్నారు. ఇక 45-60 ఏళ్లు మధ్య ఉన్నవారు 36 శాతం, 26-44 మధ్య వయస్కులు 11 శాతం, 18-25 ఏళ్లు మధ్య ఉన్నవారు 1 శాతం, 17 ఏళ్లు కంటే తక్కువ ఉన్నవారు 1 శాతం మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌‌ భూషణ్‌ వెల్లడించారు. కాగా, దేశంలో రికవరీ శాతం.. యాక్టివ్ కేసులతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు. చికిత్స పొందుతున్న బాధితుల్లో 2.70 శాతం మంది ఆక్సిజన్ సపోర్ట్‌తో, 1.92 శాతం మంది ఐసీయూలో, 0.29 శాతం మంది వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. 

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!

వరద బాధితులకు ఏపీ సర్కార్ చేయూత..!

వృత్తి పన్ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Loading...
Unable to load recommendations.
Follow Us