దేశంలో కొత్తగా 31,521 పాజిటివ్ కేసులు, 385 మరణాలు.. 95 శాతానికి చేరుకున్న రికవరీ రేటు..

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,521 పాజిటివ్ కేసులు, 385 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 97,67,959కు చేరింది.

దేశంలో కొత్తగా 31,521 పాజిటివ్ కేసులు, 385 మరణాలు.. 95 శాతానికి చేరుకున్న రికవరీ రేటు..

Updated on: Dec 10, 2020 | 11:17 AM

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,521 పాజిటివ్ కేసులు, 385 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 97,67,959కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 3,72,293 ఉండగా.. ఇప్పటివరకు 92.53 లక్షల మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న దేశవ్యాప్తంగా 412 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు వైరస్ కారణంగా 1,41,772 మంది ప్రాణాలు కోల్పోయారు.

అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో తప్పితే మిగిలిన చోట్ల పాజిటివ్ కేసుల కంటే రికవరీ రేటు అధికంగా ఉంటోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 37,725 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అటు నిన్న 9,22,959 టెస్టులు చేయగా.. మొత్తం దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య 15,07,59,726కు చేరింది. దేశంలో 94.74 శాతానికి రికవరీ రేటు చేరిందంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 3.81 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది.