నటుడు అల్లు అర్జున్పై సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోవిడ్ రూల్స్ అతిక్రమించారని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుంటాల జలపాతం సందర్శనకు అనుమతి లేకపోయినా.. అల్లు అర్జున్తో పాటు ‘పుష్ప’ టీం సభ్యులు మూడు రోజుల క్రితం సందర్శించడం జరిగిందని.. తిప్పేశ్వర్లో అనుమతి లేకుండా చిత్రీకరణ కూడా చేశారని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తీక్ రాజు తెలిపారు. కాగా, ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ప్రాధమిక విచారణ చేసి కేసు నమోదు చేస్తామని అన్నారు. (Complaint Filed Against Allu Arjun)
Also Read:
బిగ్ బాస్ 4: గంగవ్వను బయటికి పంపే ప్లాన్.. అందుకే టార్గెట్ చేస్తున్నారా.!
బిగ్ బాస్ 4: ఈ సీజన్లో ఆమెదే భారీ రెమ్యునరేషన్
బిగ్ బాస్ హౌస్లోకి రామ్చరణ్ హీరోయిన్..!
సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!