AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్: ఇక కామర్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకూ ‘గేట్‌’ రాసే అవకాశం..!

ఇంజనీరింగ్‌ విద్యార్థులు పీజీ చేయడానికి రాయవలసిన యోగ్యతా పరీక్ష గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌)లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే సంవత్సరం నుంచి గేట్‌లో హ్యుమానిటీస్

గుడ్ న్యూస్: ఇక కామర్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకూ ‘గేట్‌’ రాసే అవకాశం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 27, 2020 | 10:54 AM

Share

ఇంజనీరింగ్‌ విద్యార్థులు పీజీ చేయడానికి రాయవలసిన యోగ్యతా పరీక్ష గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌)లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే సంవత్సరం నుంచి గేట్‌లో హ్యుమానిటీస్‌ సబ్జెక్టులనూ చేర్చనున్నారు. దీంతో కామర్స్‌, ఆర్ట్స్‌ చదివిన విద్యార్థులకూ గేట్‌ రాసే అవకాశం కలుగుతుంది. సైన్స్‌, టెక్నాలజీ మాస్టర్స్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు, వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకు గేట్‌ మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటారు.

మరోవైపు.. 2021 ఫిబ్రవరి 5, 6, 7, 12, 13వ తేదీల్లో ఈ పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహించనుంది. ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ను ఈ ఏడాదే సబ్జెక్టు పేపర్‌గా చేర్చారు. హ్యుమానిటీస్‌ సోషల్‌ సైన్స్‌నూ కలుపుకుంటే మొత్తం పేపర్ల సంఖ్య 27కు చేరుతుంది. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌‌ కనీస అర్హతగా 10+2+4 నిబంధన ఉంది. అది 10+2+3గా మారనున్న నేపథ్యంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ మూడో ఏడాదిలో ఉన్న వారు కూడా ఈ పరీక్ష రాసే అవకాశం దక్కుతుంది.  ఏటా పది లక్షల మంది వరకు గేట్‌ రాస్తుండగా.. తాజా మార్పుల కారణంగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Also Read: గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు..