AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం

సాగునీటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఎస్సారెస్పీ వరద కాల్వ ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందుతున్న తీరుపై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌రెడ్డితోపాటు, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌, విద్యాసాగర్‌రావు, రవిశంకర్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం
Balaraju Goud
|

Updated on: Jul 12, 2020 | 2:07 PM

Share

సాగునీటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఎస్సారెస్పీ వరద కాల్వ ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందుతున్న తీరుపై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌రెడ్డితోపాటు, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌, విద్యాసాగర్‌రావు, రవిశంకర్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల సాగునీటి లభ్యతపై మేడిపల్లి, కథలాపూర్ మండలాలకు చెందిన రైతులతో నేరుగా మాట్లాడిన సీఎం కేసీఆర్ పూర్తి వివరాలతో హైదరాబాద్ కు రావాలని సూచించారు. ఇందులో భాగంగా ఇవాళ ఆ ప్రాంత అన్నదాతలతో చర్చించారు. జగిత్యాల, నిజమాబాద్‌ జిల్లాల ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు కూడా పాల్గొన్నారు. ఎస్సారెస్సీ ఎగువన 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే అంశంపై సమీక్షిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మేడిపల్లి, కథలాపూర్ మండలాల్లోని వరద కాలువ ఎగువ ప్రాంతాల్లో సాగునీటి ఇబ్బందులపై సీఎం చర్చిస్తున్నారు. కరోనా నేపథ్యంలో రైతు సమన్వయ సభ్యుడు శ్రీపాల్‌రెడ్డితో సహా కొంతమందిని మాత్రమే అనుమతినిచ్చారు.