AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెవెన్యూ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ సూచనలు

ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని రెవెన్యూ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కొత్త రెవెన్యూ బిల్లుకి పూర్తి మద్దతు తెలిపిన రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులకు ఆయన పలు సూచనలు చేశారు‌. తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించినందుకు...

రెవెన్యూ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ సూచనలు
Sanjay Kasula
|

Updated on: Sep 12, 2020 | 5:46 PM

Share

ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని రెవెన్యూ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కొత్త రెవెన్యూ బిల్లుకి పూర్తి మద్దతు తెలిపిన రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులకు ఆయన పలు సూచనలు చేశారు‌. ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆకాంక్షించారు. శనివారం ప్రగతి భవన్ లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రెవెన్యూ యంత్రాంగం పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తూ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలని, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు.

తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్‌కు రెవెన్యూ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు. ఈ సందర్భంగానే కొత్త చట్టాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు.

రెవెన్యూ శాఖలో కూడా మార్పు రావాలన్నారు. తహశీల్దార్‌ ఆఫీసుల్లో సౌకర్యాల కోసం రూ.60 కోట్లు మంజూరు చేస్తామన్నారు. సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించారు. తహశీల్దార్లకు కార్ల అలవెన్స్‌లను రెగ్యులర్‌గా ఇవ్వాలని CSను కేసీఆర్ ఆదేశించారు‌. అన్ని స్థాయిల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మరోవైపు అర్హులైన వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులు.