AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాయనికి కేసీఆర్, కేటీఆర్, ఈటెల ఘన నివాళి

ఘనత కల్గిన కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ నాయని నరసింహా రెడ్డి మృతిపై సర్వత్రా సంతాప సందేశాలు, ఘన నివాళులు వెల్లువెత్తుతున్నాయి. “నాయని నరసింహా రెడ్డి గారు మరణించడం చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో వారితో ఉన్న అనుబంధం మరువలేనిది. వారి మరణం టిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.” […]

నాయనికి కేసీఆర్, కేటీఆర్, ఈటెల ఘన నివాళి
Venkata Narayana
|

Updated on: Oct 22, 2020 | 7:31 AM

Share

ఘనత కల్గిన కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ నాయని నరసింహా రెడ్డి మృతిపై సర్వత్రా సంతాప సందేశాలు, ఘన నివాళులు వెల్లువెత్తుతున్నాయి. “నాయని నరసింహా రెడ్డి గారు మరణించడం చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో వారితో ఉన్న అనుబంధం మరువలేనిది. వారి మరణం టిఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.” అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతాపం తెలిపారు. మరణ వార్త తెలిసిన వెంటనే సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయని నర్సింహారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని సీఎస్ ను ఆదేశించారు. అటు, మంత్రి కేటీఆర్ కూడా నాయని మృతిపట్ల తీవ్ర ఆవేదన, సంతాపాన్ని తెలియజేశారు.  నాయని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.