డ్రోన్లతో జగన్‌కు మరింత భద్రత..!

ప్రజాదర్బార్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి భద్రతను మరింతగా పెంచారు. తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ చర్యలను ముమ్మరం చేశారు. నివాస పరిసర ప్రాంతాలను ప్రతీక్షణం నిఘా నేత్రంలో వీక్షించేందుకు డ్రోన్‌లను వినియోగించాలని సీఎం సెక్యూరిటీ విభాగం నిర్ణయించింది. దీంతో.. నిరంతరం పరిశీలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోలీసు బలగాలతో పాటు డ్రోన్‌లను రంగంలోకి దింపారు. ఈ ఉదయం నుంచి తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. తాడేపల్లి నివాసం నుంచి అమరావతి, […]

డ్రోన్లతో జగన్‌కు మరింత భద్రత..!

Updated on: Jul 04, 2019 | 12:47 PM

ప్రజాదర్బార్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి భద్రతను మరింతగా పెంచారు. తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ చర్యలను ముమ్మరం చేశారు. నివాస పరిసర ప్రాంతాలను ప్రతీక్షణం నిఘా నేత్రంలో వీక్షించేందుకు డ్రోన్‌లను వినియోగించాలని సీఎం సెక్యూరిటీ విభాగం నిర్ణయించింది. దీంతో.. నిరంతరం పరిశీలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోలీసు బలగాలతో పాటు డ్రోన్‌లను రంగంలోకి దింపారు. ఈ ఉదయం నుంచి తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. తాడేపల్లి నివాసం నుంచి అమరావతి, విజయవాడ, గుంటూరు వైపులకు వెళ్ళే మార్గాలను డ్రోన్లతో జల్లెడపడుతున్నారు. మంగళగిరి హెడ్ క్వార్టర్స్‌ నుంచి పోలీసులు ఈ నిఘా డ్రోన్ల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే.. సీఎంకు సెక్యూరిటీ పెంచడం సాధారణ విషయమే. కానీ సడన్‌గా డ్రోన్‌లను ఎందుకు రంగంలోకి దించారో తెలియాల్సివుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us