ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ప్యాసింజర్స్ ఫుల్ ఎంజాయ్..

|

Mar 03, 2020 | 9:08 AM

ఎప్పటి నుండో వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. విమానయాన శాఖ కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. విమానంలో వైఫై ద్వారా ఇంటర్నెట్‌ సేవల్ని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.

ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ప్యాసింజర్స్ ఫుల్ ఎంజాయ్..
Follow us on

ఎప్పటి నుండో వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. విమానయాన శాఖ కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. విమానంలో వైఫై ద్వారా ఇంటర్నెట్‌ సేవల్ని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు విమానయాన సంస్థలకు అనుమతినిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

విమాన ప్రయాణంలో ఉన్నపుడు ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. వైఫై సదుపాయంతో ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, స్మార్ట్ వాచ్‌, ఈ-రీడర్‌ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫ్లైట్‌ మోడ్‌ లేదా ఎయిర్‌ప్లేన్‌ మోడ్‌లో ఉంచి వాడుకోవచ్చు అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విమానాల్లో ఇంటర్నెట్‌ సేవల వినియోగంపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘విమానంలో పైలట్‌-ఇన్‌-కమాండ్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందించవచ్చు’ అని ప్రకటనలో పేర్కొంది. తద్వారా వై-ఫై సదుపాయంతో ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోను, ట్యాబ్లెట్‌, స్మార్ట్‌వాచ్‌, ఈ-రీడర్‌ వంటి పరికరాలను ఫ్లైట్‌ మోడ్‌ లేదా ఎయిరోప్లేన్‌ మోడ్‌లోనే ఉంచి వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా.. తమ కొత్త బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానంలో వైఫై సేవల్ని కల్పించి, ఈ ఘనత సాధించిన తొలి భారత విమానయాన సంస్థగా విస్టారా ఘనత దక్కించుకోనుంది.