AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయసాయిరెడ్డిపై కేసు నమోదు

తనపై తప్పుడు అభియోగాలు చేసి  బదిలీకి కారణమయ్యారంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై  ఎస్పీ అడ్డాల వెంకటరత్నం శ్రీకాకుళం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సాయిరెడ్డిపై కేసు నమోదైంది. 30 సంవత్సరాలుగా నిజాయితీగా పని చేస్తున్నానని , ఒక్క ఫిర్యాదుతో తన పరువును తీశారని ఆయన ఆరోపించారు. ‘టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్‌ బంధువు ఈ నెల 18న విశాఖపట్నంలోని నారాయణ కళాశాల నుంచి రూ.50 కోట్లను వాహనంలో తరలిస్తుండగా… ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాల […]

విజయసాయిరెడ్డిపై కేసు నమోదు
Ram Naramaneni
|

Updated on: Mar 28, 2019 | 12:58 PM

Share

తనపై తప్పుడు అభియోగాలు చేసి  బదిలీకి కారణమయ్యారంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై  ఎస్పీ అడ్డాల వెంకటరత్నం శ్రీకాకుళం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సాయిరెడ్డిపై కేసు నమోదైంది. 30 సంవత్సరాలుగా నిజాయితీగా పని చేస్తున్నానని , ఒక్క ఫిర్యాదుతో తన పరువును తీశారని ఆయన ఆరోపించారు.

‘టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్‌ బంధువు ఈ నెల 18న విశాఖపట్నంలోని నారాయణ కళాశాల నుంచి రూ.50 కోట్లను వాహనంలో తరలిస్తుండగా… ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు నేను ఆ వాహనానికి రక్షణ కల్పించి… ఆ నగదును నిర్దేశిత ప్రదేశాలకు చేర్చినట్లు విజయసాయిరెడ్డి నాపై భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణ పూర్తి అవాస్తవం. ఈ నెల 18న రోజంతా జిల్లాలోని పోలీసులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించాను. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై చర్చించాను. ఆ రోజు ఎస్పీ కార్యాలయం నుంచి నేను బయటకు కదలలేదు. పైన పేర్కొన్న ఘటనకు సంబంధించి నాకు ఎలాంటి ఫోన్‌కాల్స్‌ కానీ, సమాచారం కానీ రాలేదు. వాస్తవంగా ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 1.10 గంటలకు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండటం పుంగిటవలస వద్ద డిప్యూటీ తహసీల్దార్‌ ఆర్‌.గంగాభవానీ నేతృత్వంలోని స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందం ఓ కారును తనిఖీ చేయగా.. అందులో టీడీపీకి చెందిన ప్రచార సామాగ్రి లభించింది. తనిఖీ అనంతరం సామాగ్రిని స్వాధీనం చేసుకుని దాని విలువను అంచనా కట్టారు. దానికి సంబంధించి రూ.7 వేల ఖర్చును అభ్యర్థి ఎన్నికల వ్యయానికి కలిపారు. తన రోజువారీ నివేదికలో ఈ వివరాలను గంగాభవానీ ఎన్నికల సంఘానికి పంపించారు’ అని ఫిర్యాదులో వెంకటరత్నం పేర్కొన్నారు.