Breaking : జమ్ములో అంతర్జాతీయ సరిహద్దు వద్ద టన్నెల్ గుర్తింపు

|

Aug 29, 2020 | 4:26 PM

జమ్ములో అంతర్జాతీయ సరిహద్దు వద్ద టన్నెల్ గుర్తించింది బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్. టన్నెల్ ద్వారా చొరబాట్లు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.

Breaking : జమ్ములో అంతర్జాతీయ సరిహద్దు వద్ద టన్నెల్ గుర్తింపు
Follow us on

జమ్ములో అంతర్జాతీయ సరిహద్దు వద్ద సాంబా సెక్టార్‌ పరిధిలో   టన్నెల్ గుర్తించింది బోర్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్. టన్నెల్ ద్వారా చొరబాట్లు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఆ సొరంగ మార్గంలో ఇసుక బ‌స్తాల‌ను భార‌త బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిపై పాకిస్థాన్‌కు చెందిన గుర్తులు కనిపించినట్లు స‌మాచారం. ఈ తరహాలో మరికొన్ని టన్నెళ్లు ఉండొచ్చని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో వెంట‌నే అల‌ర్టెయిన భార‌త భద్ర‌తా బ‌ల‌గాలు చొరబాట్లకు ఆస్కారం కల్గించే ప్రదేశాలపై నిఘా పెంచాయి.

 

Also Read :

తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు

కడపజిల్లాలో ఎస్ఐ సాహసం, ప్రాణాల‌కు తెగించి