సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ప్రచారం చేసి.. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాడు ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. తాజాగా ఆయనతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రహస్య ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఒక్కప్పుడు బీహార్ డెకాయిట్ అని ఆయనను విమర్శించిన బాబు.. పీకేతో ఒప్పందం కుదుర్చుకున్నారని వస్తున్న వార్తలు ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ధీర్ఘకాలానికి ఈ ఒప్పందం ఉంటుందని ఆమె తెలిపారు. అయితే ఈ సమాచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఏపీఎన్నికలకు సంబంధించినంతవరకు ఇప్పటివరకు జగన్ కోసం ప్రచారం చేసిన పీకే.. ఇప్పుడు ఎలాంటి వ్యూహం అనుసరిస్తాడో చూడాలి.?
Big Breaking- #AndhraPradesh– Interesting twist in AP politics. After a loss, TDP chief @ncbn Naidu makes a multi- year contract proposal to IPAC- @PrashantKishor team, which worked with @ysjagan, who had a landslide victory in 2019 Assembly polls. #TDP @naralokesh @IndianPAC
— Rishika Sadam (@RishikaSadam) June 14, 2019