‘బాలుడు దీక్షిత్‌ ను చంపిన వాడు ఎన్ కౌంటర్’ వార్తలు అవాస్తవం: ఎస్పీ ప్రెస్ మీట్

|

Oct 22, 2020 | 12:21 PM

శనగపురం బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, మర్డర్ ఉదంతంపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశతోనే స్థానికుడైన మందా సాగర్ అనే వ్యక్తి దీక్షిత్ ను మోటర్ బైక్ పై తీసుకెళ్లిన కేవలం రెండుగంటల్లోనే భయంతో గొంతునులిమి చంపినట్టు ఎస్పీ వెల్లడించారు. అయితే, కేసుకు సంబంధించి మరో సారి ఈ సాయంత్రం కాని, రేపు ఉదయంకాని మరోసారి మీడియా ముందుకొచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. బాలుడ్ని చంపిన నిందితుల్ని పోలీసులు ఎన్ […]

బాలుడు దీక్షిత్‌ ను చంపిన వాడు ఎన్ కౌంటర్ వార్తలు అవాస్తవం: ఎస్పీ ప్రెస్ మీట్
Follow us on

శనగపురం బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, మర్డర్ ఉదంతంపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. త్వరగా డబ్బు సంపాదించాలన్న దురాశతోనే స్థానికుడైన మందా సాగర్ అనే వ్యక్తి దీక్షిత్ ను మోటర్ బైక్ పై తీసుకెళ్లిన కేవలం రెండుగంటల్లోనే భయంతో గొంతునులిమి చంపినట్టు ఎస్పీ వెల్లడించారు. అయితే, కేసుకు సంబంధించి మరో సారి ఈ సాయంత్రం కాని, రేపు ఉదయంకాని మరోసారి మీడియా ముందుకొచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. బాలుడ్ని చంపిన నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని కోటిరెడ్డి తేల్చిచెప్పారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఎస్పీ మాటల్లోనే.. ఈ క్రింది వీడియోలో..   కిడ్నాప్ చేసిన రెండు గంటలకే దీక్షిత్ ను చంపేశారంటోన్న పోలీసులు!