బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునక..

|

Aug 20, 2020 | 9:37 PM

తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరులోని శబరి నది బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునిగిపోయింది. శబరి నదిలో వంతెన పిల్లర్‌ను ఢీకొని లాంచీ రెండు ముక్కలైంది. ఈ ఘటనలో లాంచీ పూర్తిగా మునిపోయింది...

బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునక..
Follow us on

తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరులోని శబరి నది బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునిగిపోయింది. శబరి నదిలో వంతెన పిల్లర్‌ను ఢీకొని లాంచీ రెండు ముక్కలైంది. ఈ ఘటనలో లాంచీ పూర్తిగా మునిపోయింది. చీకటి కావడంతో లాంచీలో ఎంత మంది ఉన్నారనే విషయం తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై రెవెన్యూ సిబ్బంది మాట్లాడుతూ లాంచీలో ఎంత మంది ఉన్నారో ఇంకా తెలియట్లేదని త్వరలోనే వివరాలు తెలియజేస్తాన్నారు.

లాంచీ ప్రమాదానికి గురైన సమయంలో లాంచీలో ముగ్గురు ఉన్నట్టు సమాచారం. వరద బాధితులకు నిత్యావసరాలు అందించి తిరిగి వస్తుండగా ఈ లాంచీ ప్రమాదానికి గురైంది. వరద ప్రవాహంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.