బ్రేకింగ్.. పాకిస్థాన్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి..
పాకిస్థాన్ బాంబు పేలుడుతో దద్ధరిల్లింది. శుక్రవారం నాడు సింధ్ ప్రావిన్స్లోని గోట్కీ ప్రాంతంలో సింధ్ రేంజర్లు లక్ష్యంగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
పాకిస్థాన్ బాంబు పేలుడుతో దద్ధరిల్లింది. శుక్రవారం నాడు సింధ్ ప్రావిన్స్లోని గోట్కీ ప్రాంతంలో సింధ్ రేంజర్లు లక్ష్యంగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఒకరు సింధ్ రేంజర్ కూడా ఉన్నట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింధ్ రేంజర్ల వాహనం లక్ష్యంగా.. గోట్కీ మార్కెట్ ఏరియాలో ఈ దాడి జరిగిందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే మృతుల బాడీలను స్థానిక ఆస్పత్రికి తరలించామాని.. క్షతగాత్రులను కూడా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మార్కెట్ యార్డ్ ప్రాంతంలో కర్డన్ సెర్చ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఏ ఉగ్ర సంస్థ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, గత వారం ఇస్లామాబాద్ ప్రాంతంలో కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది.
At least three people including a Sindh Rangers personnel were dead on Friday in a blast targeting a vehicle of the Rangers in Ghotki: Pakistan media
— ANI (@ANI) June 19, 2020