బిగ్ బాస్ 4లో ఆ నలుగురు హీరోయిన్లు..? నిజమేనా.!

| Edited By:

Jun 27, 2020 | 4:07 PM

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' హిందీతో పాటుగా అన్ని దక్షిణాది భాషల్లోని ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటివరకు తెలుగులో మూడు సీజన్‌లు కంప్లీట్ చేసిన ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్‌కు ముస్తాబవుతోంది.

బిగ్ బాస్ 4లో ఆ నలుగురు హీరోయిన్లు..? నిజమేనా.!
Follow us on

బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’ హిందీతో పాటుగా అన్ని దక్షిణాది భాషల్లోని ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటివరకు తెలుగులో మూడు సీజన్‌లు కంప్లీట్ చేసిన ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్‌కు ముస్తాబవుతోంది. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవరించగా.. రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని, మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతలుగా అలరించారు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ కారణంగా ఈ నాలుగో సీజన్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి దాకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. దీనికి హోస్టుగా ఎవరు వ్యవరిస్తారనే విషయంపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ కూడా జరుగుతోంది. కొందరు నాగార్జున అంటుంటే.. మరికొందరు అక్కినేని కోడలు సమంతా హోస్టుగా వ్యవహరిస్తుందని టాక్ నడుస్తోంది. కాగా, తాజాగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్లుగా నలుగురు హీరోయిన్లు పాల్గొంటారని ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిజంగా ఇది కరెక్ట్ అయితే.. బుల్లితెర ప్రేక్షకులకు పండగ అని చెప్పాలి. శ్రద్దాదాస్, యామినీ భాస్కర్, ప్రియా వడ్లమాణి, హంసా నందినిలతో నిర్వాహకులు సంప్రదింపులు జరిపారని సమాచారం.