ఏపీ సరిహద్దుల్లో.. బారులు తీరిన తెలంగాణ మందుబాబులు..

| Edited By:

May 04, 2020 | 3:22 PM

కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఇంతో ఇన్నాళ్లూ మద్యం దుకాణాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం

ఏపీ సరిహద్దుల్లో.. బారులు తీరిన తెలంగాణ మందుబాబులు..
Follow us on

Telangana people at AP Border: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఇంతో ఇన్నాళ్లూ మద్యం దుకాణాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతించడంతో ఇన్నాళ్లూ మందులేక అల్లాడిపోయిన మద్యం ప్రియలకు ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఉదయం నుంచే మందుబాబులు మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు.

కాగా.. భద్రాచలం పట్టణానికి కేవలం అర కి.మీ దూరంలో ఏపీ పరిధిలోని తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాకకు చెందిన ఓ మద్యం దుకాణం ఇది. అక్కడ మద్యం కొనుగోలు చేసేందుకు తెలంగాణకు చెందిన మద్యం ప్రియులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు కి.మీకు పైగా మందుబాబులు ఇలా ఓపికగా నిలబడి బారులు తీరారు.

Also Read: 45 నిముషాల్లో రూ. 2లక్షల లోన్.. 6 నెలల వరకు నో ఈఎంఐ..