AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతిలో ఏ కులానికి ఎంత భూమి? : బిగ్ న్యూస్-బిగ్ డిబేట్..!

రాజధాని అమరావతి వివాధం మరోసారి తెరపైకి వచ్చింది.  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఈ విషయంపై పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నాయి. మధ్యలో కులం పంచాయితీ కూడా వచ్చి చేరింది. రాజధాని ప్రకటనకు ముందే కొంతమంది టీడీపీ నేతలు అక్కడ భూములు కొన్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాదు ఒక కులం వారి కోసమే అక్కడ టీడీపీ రాజధాని నిర్మాణం చేపట్టిందని… వారికి మాత్రమే లబ్ది చేకూరుతుందని ప్రచారం జరుగుతోన్న విషయం కూడా తెలిసిందే. ఈ విషయంపైనే టీవీ9 […]

అమరావతిలో ఏ కులానికి ఎంత భూమి? : బిగ్ న్యూస్-బిగ్ డిబేట్..!
Ram Naramaneni
|

Updated on: Oct 18, 2019 | 11:47 PM

Share

రాజధాని అమరావతి వివాధం మరోసారి తెరపైకి వచ్చింది.  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఈ విషయంపై పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నాయి. మధ్యలో కులం పంచాయితీ కూడా వచ్చి చేరింది. రాజధాని ప్రకటనకు ముందే కొంతమంది టీడీపీ నేతలు అక్కడ భూములు కొన్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాదు ఒక కులం వారి కోసమే అక్కడ టీడీపీ రాజధాని నిర్మాణం చేపట్టిందని… వారికి మాత్రమే లబ్ది చేకూరుతుందని ప్రచారం జరుగుతోన్న విషయం కూడా తెలిసిందే. ఈ విషయంపైనే టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్- బిగ్ డిబేట్ వేదికగా కీలక చర్చ జరిగింది.

టీడీపీపై వస్తున్న విమర్శలకు ఆ పార్టీ సీనియర్ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. 29 గ్రామాల కోర్ కేపిటల్‌లో ఏరియాలో(33వేల ఎకరాలు భూసేకరణగా తీసుకున్న చోట) 90 వేల మంది ప్రజానీకం నివశిస్తున్నారని..అందులో 20వేల మంది ఎస్సీలు, 20వేల మంది బీసీలు, 7 వేల మంది కమ్మవారు, 7 వేల మంది కాపులు, 7 వేల మంది రెడ్లు ఉన్నారని..మిగిలిన సంఖ్య అన్నీ కులాలకు సంబంధించిన వాళ్లని పేర్కొన్నారు.  అయితే ఇక్కడే రజనీకాంత్ కీలక పాయింట్ రైజ్ చేశారు..జనం ఎవరు ఎక్కువ ఉన్నదని కాదని…భూములు ఎవరివి ఎక్కువ ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ఇచ్చిన సమాచారం ఈ దిగువ వీడియోలో..!