West Bengal Governor Jagdeep Dhankhar : వెస్ట్ బెంగాల్ గవర్నర్ వెరైటీ విష్… ట్విట్టర్ వేదికగా ట్వీట్…
పశ్చిమ బెంగాల్ ప్రజలకు గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ వెరైటీగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో హింసకు తావులేకుండా అసెంబ్లీ ఎన్నికలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.
పశ్చిమ బెంగాల్ ప్రజలకు గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ వెరైటీగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో హింసకు తావులేకుండా అసెంబ్లీ ఎన్నికలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. పోలీసులు, అధికార యంత్రాంగం ”రాజకీయ తటస్థ” వైఖరిని పాటించాలని గవర్నర్ కోరారు. 2021లో పారదర్శక, జవాబుదారీ పరిపాలన అందాలంటూ ఆయన అభిలషించారు.
నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కాగా ట్విట్టర్లో ఇలా రాశారు… ”అపారమైన గొప్ప సంస్కృతికి, శక్తి, సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిన పశ్చిమ బెంగాల్… పోలీసులు, అధికారుల ”రాజకీయ తటస్థ” వైఖరితో, హింసకు తావులేని విధంగా 2021 ఎన్నికలు జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాను. మానవ హక్కులు భంగం వాటిల్లని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు సంతోషంగా గడపాలనీ.. పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను..” అని పేర్కొన్నారు.
గవర్నర్ ట్వీట్ ఇదే….
Pray West Bengal exemplify its enormously rich culture, its essence and intrinsic spinal strength to secure 2021 elections shun of violence with “political neutral” stance of police & administration; people enjoy human rights and administration being transparent and accountable.
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) December 31, 2020
Also Read:
National Political RoundUp 2020: కమల వికాసం… హస్త విలాపం… ప్రాంతీయ పార్టీల పోరాటం…