
ఉత్తరప్రదేశ్లో హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మార్చి 21న జరిగే హోలీకి నాలుగురోజుల ముందుగానే ఇక్కడ సంబరాలు మొదలవుతాయి. మధురలోని శ్రీరాధారాణి ఆలయంలో రంగుల పండుగను ఉత్సాహంగా జరురుపుకుంటున్నారు. వేలాదిమంది చిన్నాపెద్దా ఆడిపాడుతూ డప్పులు వాయిస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రజలు దేశవ్యాప్తంగా తరలివస్తారు. బర్సానా హోలీగా పేరు తెచ్చుకున్న ఈ సంప్రదాయ వేడుకకు విదేశీయులు భారీగా తరలివస్తుంటారు. వీధులన్నీ రంగులమయమైపోతాయి. లడ్డూ, స్వీట్లు పంచుకుంటూ ద్యాన్సులు చేస్తూ హోలీ పందుగను పెద్దఎత్తున జరుపుకుంటారు.