AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇతడేం పోస్ట్‌మ్యాన్‌..రెండేళ్లుగా వచ్చిన ఉత్తరాలు, డాక్యుమెంట్లు దాచేశాడు..లెక్క తీస్తే అధికారులు షాక్ తిన్నారు

ఈ రోజుల్లో ఏ విషయం అయినా సరే..సెకన్‌లో ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చు. కానీ డాక్యుమెంట్లు, స్టేట్మెంట్ల విషయంలో ఇప్పటికీ ప్రవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు పోస్ట్ పద్దతినే ఫాలో అవుతున్నాయి.

ఇతడేం పోస్ట్‌మ్యాన్‌..రెండేళ్లుగా వచ్చిన ఉత్తరాలు, డాక్యుమెంట్లు దాచేశాడు..లెక్క తీస్తే అధికారులు షాక్ తిన్నారు
Ram Naramaneni
|

Updated on: Dec 20, 2020 | 1:42 PM

Share

ఈ రోజుల్లో ఏ విషయం అయినా సరే..సెకన్‌లో ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చు. కానీ డాక్యుమెంట్లు, స్టేట్మెంట్ల విషయంలో ఇప్పటికీ ప్రవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు పోస్ట్ పద్దతినే ఫాలో అవుతున్నాయి. ముఖ్యంగా ఆధార్‌ కార్డులు, బ్యాంక్ ఏటీఎంలు, లోన్లకు సంబంధించిన డెడ్‌లైన్లు వంటివి పోస్ట్ ద్వారా రావడం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే తాజాగా ఓ పోస్ట్‌మ్యాన్‌కు ఉద్యోగం చేయడం బద్దకం అనిపించిందో ఏమో…తన వద్దకు వచ్చే ఉత్తరాలను ఏకంగా రెండేళ్ల నుంచి బట్వాడా చేయడం ఆపేశాడు. వాటన్నింటినీ తన బంధువుల ఇంట్లో ఓ మూలన పడేశాడు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో తాజాగా అతన్ని సస్సెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..బాన్సువాడ మండలంలోని తాడ్కోలుకు చెందిన బాలకృష్ణ 2019 జనవరిలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీట్ 1 పోస్ట్ మ్యాన్ కింద విధుల్లో చేరాడు. అయితే అతడు సర్వీస్ మొదలెట్టిన్పట్నుంచి ఉత్తరాలను బట్వాడా చేయలేదు. వాటన్నింటినీ తీసుకెళ్లి గంపగుత్తగా..తన బంధువుల హోటల్‌లో ఓ మూలన పడేశాడు. తమకు ఉత్తరాలు అందడం లేదని స్థానికులు సమాచారం ఇవ్వడంతో..అధికారులు తనిఖీలు చేయగా…12 సంచుల్లో సుమారు 7,000 ఉత్తరాలు, డాక్యుమెంట్లు దొరికాయి. వాటిలో ఆధార్, పాన్ వంటి ముఖ్యమైన కార్డులు..బ్యాంక్ సమాచారం  వంటివి ఉన్నాయి. వాటిని తానే దాచినట్లు అంగీరించడంతో ఉన్నతాధికారులు అతడ్ని స్పాట్‌లోనే సస్పెండ్ చేశారు.

Aso Read :

Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ

Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి