Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి
తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు.
తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. తునిలో ఓ వ్యక్తి తన ఇద్దరు కుమారులను బైక్పై తీసుకెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో దుర్గ (10), తాతాజీ(15) స్పాట్లోనే ప్రాణాలు విడిచారు. బాధితులు విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన వారిగా గుర్తించారు. కాగా, ప్రమాదం నుంచి చిన్నారుల తండ్రి క్షేమంగా బయటపడ్డాడు. తన కళ్ల ముందే ఇద్దరు బిడ్డలు మృతి చెందడంతో ఆ తండ్రి వేదన చూపరులను కన్నీరు పెట్టించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Also Read : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కరోనా పాజిటివ్.. చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిక..