ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వ్యవస్థాపకుడు, చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపారు. అజీమ్ ప్రేమ్జీ జూలై 30న విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి వైదొలగబోతున్నారని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా, బోర్డు మెంబర్గా ఉన్న ప్రేమ్జీ తనయుడు రిషద్ ప్రేమ్జీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులు కానున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న అబిదాలీ జడ్ నీముచ్ వాలా ఇకపై సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగనున్నారు.
ఇకపోతే జూలై 31, 2019 నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ నిర్ణయానికి వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని తెలిపింది. కాగా ప్రేమ్జీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, వ్యవస్థాపక చైర్మన్గా కొనసాగుతారని కంపెనీ తెలిపింది.
#AzimPremji will retire as executive chairman of @Wipro with effect from July 30
For more on this, read: https://t.co/PqP4qDqhgm pic.twitter.com/6dHGaS9upX
— Hindustan Times (@htTweets) June 6, 2019