Breaking : అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కరోనా పాజిటివ్

| Edited By: Pardhasaradhi Peri

Sep 14, 2020 | 11:05 AM

అరకు కొత్త ఎంపీ గొడ్డేటి మాధవి కరోనా బారిన పడ్డారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఢిల్లీ వచ్చిన మాధవి, జ్వరంతో బాధపడుతున్నారు.

Breaking : అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కరోనా పాజిటివ్
Follow us on

అరకు కొత్త ఎంపీ గొడ్డేటి మాధవి కరోనా బారిన పడ్డారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఢిల్లీ వచ్చిన మాధవి, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ సెక్రటేరియట్ సిబ్బంది  ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించారు. ఫలితాల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.  దీంతో రెండు వారాల పాటు  ఢిల్లీలోనే చికిత్స తీసుకోనున్నారు మాధవి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వడివడిగా విస్తరిస్తోంది. ఆదివారం ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం కొత్తగా 9536 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 66 మంది వైరస్ కారణంగా మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,67,123కి చేరింది. ఇందులో 95,072 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 4912కి చేరింది.

Also Read : ప్రేమ గాయం : బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య