AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం: మంత్రి గౌతమ్ రెడ్డి

చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెగేట్టు లేదు. కరోనా కారణంగా ఆపివేసిన ఈ ఎన్నికల్ని ఇప్పుడు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో సమావేశాన్ని నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మొండికేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి గౌతమ్ రెడ్డి ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రభావం కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ, మళ్లీ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారని, ఈ నేపథ్యంలో నవంబర్ […]

స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం: మంత్రి గౌతమ్ రెడ్డి
Venkata Narayana
|

Updated on: Oct 23, 2020 | 4:51 PM

Share

చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెగేట్టు లేదు. కరోనా కారణంగా ఆపివేసిన ఈ ఎన్నికల్ని ఇప్పుడు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీలతో సమావేశాన్ని నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మొండికేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి గౌతమ్ రెడ్డి ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రభావం కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ, మళ్లీ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారని, ఈ నేపథ్యంలో నవంబర్ లో ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేదని ఆయన తేల్చేశారు. వచ్చే నెలలో కేసులు పెరిగే అవకాశం ఉండొచ్చన్నారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్నవి అసెంబ్లీ ఎన్నికలని.. అయితే, మనవి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో కొంత వెసులుబాటు ఉంటుందని తెలిపారు.