AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా పరీక్షల ఫలితాలు ఆలస్యం.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశం..

Not Delay Corona Tests: ఏపీలో పలు చోట్ల కరోనా పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వీఅర్డీఎల్ ల్యాబ్‌లు, ట్రూనాట్ ల్యాబ్‌లలో నమూనా సేకరణ కౌంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ కౌంటర్లు 24 గంటలూ పని చేయడమే కాకుండా.. కోవిడ్ టెస్ట్ ఫలితాలను వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం నమూనాలన్నింటిని జాగ్రత్త పరచాలని తెలిపింది. కాగా, రాష్ట్రంలో రోజుకు […]

కరోనా పరీక్షల ఫలితాలు ఆలస్యం.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశం..
Ravi Kiran
|

Updated on: Jul 15, 2020 | 12:48 AM

Share

Not Delay Corona Tests: ఏపీలో పలు చోట్ల కరోనా పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వీఅర్డీఎల్ ల్యాబ్‌లు, ట్రూనాట్ ల్యాబ్‌లలో నమూనా సేకరణ కౌంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ కౌంటర్లు 24 గంటలూ పని చేయడమే కాకుండా.. కోవిడ్ టెస్ట్ ఫలితాలను వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం నమూనాలన్నింటిని జాగ్రత్త పరచాలని తెలిపింది. కాగా, రాష్ట్రంలో రోజుకు 20 వేలకు పైగా టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొందరి ఫలితాలు రావడానికి 4-5 రోజులు సమయం పడుతోంది.