రాజధాని రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
రాజధాని ప్రాంత రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భూములు ఇచ్చిన రైతులకు చెల్లించేందుకు రూ.187 కోట్ల 40 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏప్రిల్లో సీఆర్డీఏ పంపిన ప్రతిపాదనల మేరకు ఈ డబ్బును విడుదల చేశారు. అధికారులు బుధవారం నుంచి రైతులకు ఈ డబ్బును చెల్లించనున్నారు. తాజాగా ప్రభుత్వం చెల్లించిన కౌలు ఐదో ఏడాదిది.. మొత్తం పదేళ్లపాటు రైతులకి కౌలు చెల్లించేలా సీఆర్డీయే ఒప్పందం కుదుర్చుకుంది. […]
రాజధాని ప్రాంత రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భూములు ఇచ్చిన రైతులకు చెల్లించేందుకు రూ.187 కోట్ల 40 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏప్రిల్లో సీఆర్డీఏ పంపిన ప్రతిపాదనల మేరకు ఈ డబ్బును విడుదల చేశారు. అధికారులు బుధవారం నుంచి రైతులకు ఈ డబ్బును చెల్లించనున్నారు. తాజాగా ప్రభుత్వం చెల్లించిన కౌలు ఐదో ఏడాదిది.. మొత్తం పదేళ్లపాటు రైతులకి కౌలు చెల్లించేలా సీఆర్డీయే ఒప్పందం కుదుర్చుకుంది. ఒక ఎకరా మెట్టభూమికి ఏడాదికి రూ.30వేలు.. జరీబు భూమికి రూ.50వేలు కౌలు కింద చెల్లిస్తోంది.