ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో మరో సారి స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రావడం కాస్త ఆలస్యం అవుతుండడంతో అధికారులు మార్పులు చేశారు. సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం 5:30 గంటలకు ప్రధాని నిర్వహించే రాష్ట్ర ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో అన్నమయ్య భవన్ నుంచి సీఎం పాల్గొననున్నారు. అనంతరం 6:15 గంటలకు శ్రీవారికీ పట్టు వస్త్రాలు సమర్పించేందుకు బేడీ ఆంజినేయ స్వామి ఆలయం వద్దకు సీఎం జగన్ చేరుకోనున్నారు. ఈ రాత్రికి తిరుమలలోనే సీఎం బస చేయనున్నారు. రేపు మరోసారి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సీఎం జగన్ అమరావతికి పయనం కానున్నారు.