ఏపీకి అదనపు ఆదాయం కోసం జగన్ కసరత్తు

| Edited By:

Jun 03, 2019 | 4:39 PM

ఆర్థిక వనరులను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్డింగుల నుంచి గ్రీన్ టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఇక ముందు రాష్ట్రంలో అయిదు వేల చదరపు అడుగుల వైశాల్యం మించి నిర్మించే భవనాల మీద ఈ పన్ను పడుతుంది. చదరపు అడుగుకు రు. 3 చొప్పున ఈ టాక్స్ వసూలు చేయాలని ఈ రోజు గనుల శాఖ మీద జరిగిన సమీక్ష సమావేేశంలో నిర్ణయించారు. ఇదే విధంగా మైనింగ్ కోసం లీజుకు తీసుకున్న క్వారీలను వేరొకరికి బదిలీ చేయడాన్ని […]

ఏపీకి అదనపు ఆదాయం కోసం జగన్ కసరత్తు
Follow us on

ఆర్థిక వనరులను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్డింగుల నుంచి గ్రీన్ టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఇక ముందు రాష్ట్రంలో అయిదు వేల చదరపు అడుగుల వైశాల్యం మించి నిర్మించే భవనాల మీద ఈ పన్ను పడుతుంది. చదరపు అడుగుకు రు. 3 చొప్పున ఈ టాక్స్ వసూలు చేయాలని ఈ రోజు గనుల శాఖ మీద జరిగిన సమీక్ష సమావేేశంలో నిర్ణయించారు.

ఇదే విధంగా మైనింగ్ కోసం లీజుకు తీసుకున్న క్వారీలను వేరొకరికి బదిలీ చేయడాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనింగ్ లీజుల బదిలీలతో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుబంధ పరిశ్రమలు వున్న క్వారీలను మాత్రమే బదలాయించుకునేందుకే అనుమతివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం 20 ఏళ్లుగా వున్న మైనింగ్ లీజు కాలాన్ని అనుబంధ పరిశ్రమలు పెడితే 30 ఏళ్లకు పెంచాలని సూచించారు. ఆర్థిక వనరులను పెంచుకునేందుకు జగన్ ప్రభుత్వం ‘గార్బేజ్ టాక్స్’ కూడా వసూలు చేయాలని నిర్ణయించింది. దీనిపై సమగ్ర నివేదికను తయారుచేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.