జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

|

Jun 09, 2020 | 10:46 AM

కరోనాపై పోరులో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహకారం తీసుకోవాలన్న ఆయన.. వెంటనే వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!
Follow us on

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నియంత్రణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని.. ఇందుకోసం వార్డు/ గ్రామ వాలంటీర్లతో విస్తృతంగా ప్రచారం చేయించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా నివారణ చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పైవిధంగా నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 2,3 వారాలు చాలా కీలకమైనవని, ప్రజల్లో కరోనాపై అపోహలు, భయాలు తొలగించే విధంగా వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయించాలని అధికారులకు సూచించారు. ఒకవేళ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే.. అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ క్లస్టర్ల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

కరోనాపై పోరులో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సహకారం తీసుకోవాలన్న ఆయన.. వెంటనే వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే అంతర్రాష్ట్ర రాకపోకల వివరాలు గురించి కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 6 రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. కాగా, జిల్లాల వారీగా 71 సెంటర్లలో 15,614 బెడ్లను సిద్దం చేసినట్లు అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. బోధనాస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 9700 పోస్టులను భర్తీ చేసేందుకు గతంలోనే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

Also Read: 

రేపటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ…

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..