నా కథ ఆధారంగానే సినిమా తీశారు.. ఆ మూవీ విడుదల ఆపండి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అమృత..

|

Dec 23, 2020 | 7:50 PM

కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. అటు షూటింగ్‏లు కూడా ఆగిపోయాయి. ఇటీవల కొన్ని సినిమాల షూటింగ్‏లు తిరిగి ప్రారంభమయ్యాయి.

నా కథ ఆధారంగానే సినిమా తీశారు.. ఆ మూవీ విడుదల ఆపండి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అమృత..
Follow us on

కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. అటు షూటింగ్‏లు కూడా ఆగిపోయాయి. ఇటీవల కొన్ని సినిమాల షూటింగ్‏లు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం లాక్‏డౌన్ సమయంలోనూ వరుస సినిమాలను రీలిజ్ చేస్తూ తెగ బిజీగా ఉండిపోయాడు. అంతే కాకుండా సొంతంగా ఆన్‏లైన్ థియేటర్ ఓపెన్ చేసి మరీ తన సినిమాలను విడుదల చేస్తున్నాడు. కాగా ఇటీవల రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన మర్డర్ సినిమా హాట్ టాపిక్‏గా మారిన విషయం తెలిసిందే.

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యకు సంబంధించినట్టుగా ఈ సినిమాను తీసినట్లుగా ట్రైలర్‏లో తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తిగా తన కథ ఆధారంగానే చిత్రీకరించారని.. తమ కుటుంబ మనోభావాలను దెబ్బతీసేలా ఈ చిత్రం ఉందని.. వెంటనే ఈ మూవీ విడుదలను నిలిపివేయాలని ప్రణయ్ భార్య అమృత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కథ ఆధారంగానే వర్మ ఈ సినిమా తీశారని అమృత పిటిషన్‏లో పేర్కోంది. అంతేకాకుండా వర్మ తెలివితేటలు ఉపయోగించి తన కథనే సినిమాగా తీసి కోర్టును తప్పుదోవపట్టించారని, లాంచ్ పిటిషన్‏ను విచారించాలని అమృత హైకోర్టును కోరింది. కాగా అటు లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్ట్ విచారణకు నిరాకరించడంతో చిత్ర యూనిట్ రేపు ‘మర్డర్’ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైంది.