AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ శుభ ముహూర్తం ‘…. ఇక తెలంగాణకు ‘ కమల వికాసం ‘ ?

తెలంగాణాలో బీజేపీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో హైదరాబాద్ చేరిన హోమ్ మంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పహాడీ షరీఫ్ ప్రాంతంలోని రంగనాయకుల తండాని విజిట్ చేసిన ఆయన.. సోనీబాయి అనే గిరిజన మహిళకు సభ్యత్వ నమోదు పత్రాన్ని అందజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయన ఆమె ఇంటికి చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమిత్ షా కోసం సోనీబాయి… జొన్నరొట్టె, […]

' శుభ ముహూర్తం '.... ఇక తెలంగాణకు ' కమల వికాసం ' ?
Pardhasaradhi Peri
|

Updated on: Jul 07, 2019 | 2:00 PM

Share

తెలంగాణాలో బీజేపీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో హైదరాబాద్ చేరిన హోమ్ మంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పహాడీ షరీఫ్ ప్రాంతంలోని రంగనాయకుల తండాని విజిట్ చేసిన ఆయన.. సోనీబాయి అనే గిరిజన మహిళకు సభ్యత్వ నమోదు పత్రాన్ని అందజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయన ఆమె ఇంటికి చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమిత్ షా కోసం సోనీబాయి… జొన్నరొట్టె, పప్పు,ఉప్మా, తదితర డిష్ లను తయారు చేసిందని, అవి ఆరగించి అమిత్ షా టీ తాగారని తెలిసింది. బీజేపీలో ఈ గిరిజన మహిళ కొంతకాలంగా క్రియాశీల కార్యకర్తగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో షా తో బాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతరనేతలు పాల్గొన్నారు. తెలంగాణాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం యుధ్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఈ సందర్భంగా అమిత్ షా రాష్ట్ర పార్టీ నాయకులకు సూచించారు.