కరోనా కాలంలో.. వేల సంఖ్యలో కోళ్ల మృతి.. కారణమేంటంటే..

| Edited By:

Apr 25, 2020 | 7:29 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. బీహార్‌లోని నవాడా జిల్లా రాజాత్ గ్రామంలో గల  ఒక ప్రైవేట్ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూతో 9 వేల కోళ్లు చనిపోయాయి.

కరోనా కాలంలో.. వేల సంఖ్యలో కోళ్ల మృతి.. కారణమేంటంటే..
Follow us on

Bird Flu: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. బీహార్‌లోని నవాడా జిల్లా రాజాత్ గ్రామంలో గల  ఒక ప్రైవేట్ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్ ఫ్లూతో 9 వేల కోళ్లు చనిపోయాయి. జంతు, మత్స్య వనరుల శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ దివాకర్ ప్రసాద్ ఈ విషయాన్ని తెలిపారు. రాబోయే మూడు నెలల పాటు ఈ ప్రాంతంలో పౌల్ట్రీ పెంపకాన్ని నిషేధిస్తామని ఆయన తెలియజేశారు.

కాగా.. రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతంలోనూ బర్డ్ ఫ్లూ వ్యాపించలేదని దివాకర్ చెప్పారు. ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,  గుడ్లు, మాంసాన్ని తినడానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచాలని వ్యవసాయ, జంతు, మత్స్య వనరుల శాఖ మంత్రి ప్రేమ్ కుమార్ పశుసంవర్ధక శాఖలోని అన్ని జిల్లా స్థాయి, డివిజనల్ స్థాయి అధికారులకు సూచించారని ఆయన వివరించారు.