AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravati : నేడు అమరావతి బంద్​..

అమరావతిలో రైతులు సడన్‌గా నేడు(శనివారం) అమరావతి బంద్‌‌కు పిలుపునిచ్చారు. అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో బంద్ పాటించాలని నిర్ణయించారు. విద్య, వ్యాపార సంస్థలు బంద్‌‌కు సహకరించాలని అమరావతి జేఏసీ కోరింది. మందడంలో రైతు ఐకాస నేత సుధాకర్​పై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ.. బంద్‌కు పిలుపునిచ్చినట్లు జేఏసీ నేతలు తెలిపారు.

Amaravati : నేడు అమరావతి బంద్​..
Ram Naramaneni
|

Updated on: Feb 22, 2020 | 7:22 AM

Share

Amaravati :  అమరావతిలో రైతులు సడన్‌గా నేడు(శనివారం) అమరావతి బంద్‌‌కు పిలుపునిచ్చారు. అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో బంద్ పాటించాలని నిర్ణయించారు. విద్య, వ్యాపార సంస్థలు బంద్‌‌కు సహకరించాలని అమరావతి జేఏసీ కోరింది. మందడంలో రైతు ఐకాస నేత సుధాకర్​పై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ.. బంద్‌కు పిలుపునిచ్చినట్లు జేఏసీ నేతలు తెలిపారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. 66 రోజులుగా (నేడు 66వ రోజు) వారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెం, మందడం ఘటనల్లో రైతులు, మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలే రాజధాని విషయంలో తమకు న్యాయం జరగట్లేదనే బాధలో రైతులు ఉండగా… అదే అమరావతిలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నవారి ఇళ్లపై నుంచి కొందరు పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగించడం పెద్ద దుమారానికి దారి తీస్తోంది. గ్రామాల్లో మహిళలు స్నానం చేస్తుంటే, డ్రోన్ కెమెరాలు వినియోగించి వాటిని చిత్రీకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆ ఆరోపణలను పోలీసులు ఖండించారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.