అలర్ట్: రేపటి నుంచి స్కూళ్లలో అడ్మిషన్లు.. ఆఖరు తేదీ ఎప్పుడంటే..?

| Edited By:

Jul 26, 2020 | 2:50 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా సంక్షోభంతో మూతబడిన పాఠశాలలు తిరిగి తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి

అలర్ట్: రేపటి నుంచి స్కూళ్లలో అడ్మిషన్లు.. ఆఖరు తేదీ ఎప్పుడంటే..?
Follow us on

Admissions in schools in AP: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా సంక్షోభంతో మూతబడిన పాఠశాలలు తిరిగి తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో.. రేపటి (జులై 27) నుంచి సెప్టెంబరు 4 వరకూ అడ్మిషన్లకు అనుమతించారు.

అయితే, విద్యార్థులు స్కూళ్లకు రాకుండా, వారి తల్లిదండ్రులు మాత్రమే స్కూళ్లకు వచ్చేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి టీచర్ కూడా వారానికి ఒకసారి స్కూలుకు రావాలని, ఆన్‌లైన్‌ బోధన చేపట్టవచ్చని ప్రభుత్వం తెలిపింది.

Read More:

ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. అందుబాటులో.. 54 రకాల ఔషధాలు..

కరోనా బాధితుల కోసం.. నిరంతర సేవలో.. 216 అంబులెన్సులు..