
మెగాస్టార్ చిరంజీవికి కమల్ హాసన్ షాక్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వద్దంటూ అంటూ చిరంజీవి ఇచ్చిన సలహా పై ఆయన స్పందించారు. గెలుపు ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల్లో చైతన్యం కోసం వచ్చానని చెప్పారు. చిరంజీవి.. నాకెప్పుడూ సలహాలు ఇవ్వోద్దంటూ కమల్ వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడం వల్లే ప్రజల ఆలోచనా ధోరణి పై అవగాహన పెరిగిందని కమల్ చెప్పారు.
ప్రస్తుత రాజకీయాలు ధన, కుల ప్రవాహంలో ఉన్నాయని.. ఎంతటి స్టార్లు వచ్చినా తట్టుకోవడం కష్టమని.. కమల్ హాసన్, రజనీ కాంత్లకు చిరంజీవి చెప్పారు. అందుకు తనతో పాటు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా నిదర్శనమని.. తమను చూసి అయినా రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన మార్చుకోవాలని తమిళ హీరోలకు చిరంజీవి సలహా ఇచ్చిన విషయం తెలిసిందే..