AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెరపైకి ఓటుకు నోటు.. ఏ1 రేవంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారా..? ఏం జరగనుంది..?

దేశరాజకీయాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని కోర్టుకు హాజరుపరచాల్సి ఉంది. అయితే ఈ ఓటుకు నోటు కేసులో ఏ1గా ఉన్న రేవంత్ రెడ్డి.. డ్రోన్ కేసులో భాగంగా అరెస్ట్ అయ్యాక జైలు పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే ఇవాళ ఓటుకు నోటు కేసులో భాగంగా.. […]

తెరపైకి ఓటుకు నోటు.. ఏ1 రేవంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారా..? ఏం జరగనుంది..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 17, 2020 | 7:14 AM

Share

దేశరాజకీయాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని కోర్టుకు హాజరుపరచాల్సి ఉంది. అయితే ఈ ఓటుకు నోటు కేసులో ఏ1గా ఉన్న రేవంత్ రెడ్డి.. డ్రోన్ కేసులో భాగంగా అరెస్ట్ అయ్యాక జైలు పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే ఇవాళ ఓటుకు నోటు కేసులో భాగంగా.. ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డిని.. ఇవాళ ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను ఏసీబీ సేకరించింది. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో నిందితుల పాత్ర, అసలు సూత్రధారులకు సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు.

ఇదిలావుంటే.. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపుల ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టును కూడా కోర్టుకు అందజేశారు. 2015లో స్టీఫెన్‌సన్‌కు ఎమ్మెల్సీ ఓటు విషయంలో రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది ప్రస్తుతం కీలకం కానుంది. అయితే అంతకుముందే స్టీఫెన్‌సన్.. ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో.. రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు.