మోదీ యాత్రపై ప్రచారార్భాటం.. కోడ్ ఉల్లంఘనే: దీదీ

ప్రధాని నరేంద్రమోదీ బద్రీనాథ్, కేదార్‌నాథ్ పర్యటనలపై పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారార్భాటాన్ని దీదీ ఖండించారు. ఇది కూడా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందికే వస్తుందని ఆరోపిస్తూ.. ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. చివరి దశ ఎన్నికలు ఇంకా జరుగుతుండగా.. మోదీ పర్యటనలు చేస్తున్నారని.. ఆయన టూర్లను దేశవ్యాప్తంగా అన్ని ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయని.. దీని వలన ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక మాస్టర్ ప్లాన్‌తోనే మోదీ ఈ టూర్లను […]

మోదీ యాత్రపై ప్రచారార్భాటం.. కోడ్ ఉల్లంఘనే: దీదీ
Follow us

| Edited By:

Updated on: May 19, 2019 | 3:21 PM

ప్రధాని నరేంద్రమోదీ బద్రీనాథ్, కేదార్‌నాథ్ పర్యటనలపై పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారార్భాటాన్ని దీదీ ఖండించారు. ఇది కూడా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందికే వస్తుందని ఆరోపిస్తూ.. ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. చివరి దశ ఎన్నికలు ఇంకా జరుగుతుండగా.. మోదీ పర్యటనలు చేస్తున్నారని.. ఆయన టూర్లను దేశవ్యాప్తంగా అన్ని ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయని.. దీని వలన ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక మాస్టర్ ప్లాన్‌తోనే మోదీ ఈ టూర్లను చేపట్టారని ఆమె దుయ్యబట్టారు.

ఇండియా వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కళ్లు, చెవులుగా వ్యవహరించాల్సిన ఈసీ.. ఇదంతా చూస్తూ ప్రేక్షకపాత్ర వహిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ చేపట్టాలనుకున్న హిమాలయాల పర్యటనకు ఈసీ అనుమతినిచ్చింది. అయితే ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన పర్యటన ఉండాలని సూచించింది.