AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐరాసలో అమెరికాకు మళ్ళీ చుక్కెదురు

ఐక్యరాజ్యసమితిలో అమెరికాకు మళ్ళీ చుక్కెదురైంది. ట్రంప్ దేశం తిరిగి ఏకాకిగా నిలిచింది. ఇరాన్ పై అంతర్జాతీయ ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను ఐరాస భద్రతామండలి లోని 15 దేశాల్లో..

ఐరాసలో అమెరికాకు మళ్ళీ చుక్కెదురు
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 22, 2020 | 4:23 PM

Share

ఐక్యరాజ్యసమితిలో అమెరికాకు మళ్ళీ చుక్కెదురైంది. ట్రంప్ దేశం తిరిగి ఏకాకిగా నిలిచింది. ఇరాన్ పై అంతర్జాతీయ ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను ఐరాస భద్రతామండలి లోని 15 దేశాల్లో 13 దేశాలు తిరస్కరించాయి. రెండేళ్ల క్రితం అణు ఒప్పందం నుంచి మీరు (అమెరికా) వైదొలిగారని, అందువల్ల మీ తీర్మానం చెల్లదని మండలి పేర్కొంది. ఇరాన్ ఆయుధ ఆంక్షలకు సంబంధించి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో 30 రోజుల కౌంట్ డౌన్ విధించారు. అయితే మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా సహా ఇతర దేశాలు దీన్ని తోసిపుచ్చాయి.  2015 నాటి అణుఒప్పందాన్ని ఇరాన్ అతిక్రమిస్తోందని, అందువల్ల అంతర్జాతీయ ఆంక్షలు విధించాలని అమెరికా గతంలోనే ప్రతిపాదించింది. కానీ రెండేళ్ల క్రితం… 2018 లో ఈ ఒప్పందం-‘దారుణం’గా ఉందంటూ అమెరికా దీని నుంచి వైదొలగింది. ఇప్పుడు ఇదే సాకు చూపి ఐరాస భద్రతామండలి ఆ దేశాన్ని ఏకాకిని చేసింది.

మరోవైపు తమ దేశంలో అధ్యక్షుడు ట్రంప్ కి ఎదురుగాలి వీస్తోంది. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో   వివిధ రాష్ట్రాల్లో ఆయన పాపులారిటీ తగ్గుతుండగా అధ్యక్ష పదవికి   డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ప్రతిష్ట పెరుగుతోంది. అంటే ఇంటా బయటా కూడా ట్రంప్ అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నారు.