AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా విజ్ఞప్తి మేరకు… 850 భారతీయ ఖైదీలకు విముక్తి: నరేంద్ర మోదీ

సౌదీ అరేబియా దేశంలోని జైళ్లలో మగ్గుతున్న 850 మంది భారతీయ ఖైదీల విడుదలకు సౌదీ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధానిలో ప్రధాని మోదీ, సౌదీ రాజు సల్మాన్‌ల సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో ప్రధాని విజ్ఞప్తి మేరకు సౌదీ రాజు సల్మాన్‌ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ(ఎంఈఏ) శాఖ బుధవారం వెల్లడించింది. కాగా, సౌదీ జాతీయులకు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పించేందుకు భారత్‌ […]

నా విజ్ఞప్తి మేరకు... 850 భారతీయ ఖైదీలకు విముక్తి: నరేంద్ర మోదీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2019 | 5:38 PM

Share

సౌదీ అరేబియా దేశంలోని జైళ్లలో మగ్గుతున్న 850 మంది భారతీయ ఖైదీల విడుదలకు సౌదీ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధానిలో ప్రధాని మోదీ, సౌదీ రాజు సల్మాన్‌ల సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో ప్రధాని విజ్ఞప్తి మేరకు సౌదీ రాజు సల్మాన్‌ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ(ఎంఈఏ) శాఖ బుధవారం వెల్లడించింది. కాగా, సౌదీ జాతీయులకు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పించేందుకు భారత్‌ నిర్ణయించిందని ప్రకటించింది. అంతర్జాతీయ సోలార్‌ అలయెన్స్‌లో సౌదీ అరేబియా కూడా చేరినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే పునరుత్పాదక శక్తి రంగంలో కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా పరిశోధన, అభివృద్ధిలోనూ ఇరుదేశాలు పరస్పరం బలమైన సహాయ సహకారాలు అందించుకోవాలని సంయుక్త ప్రకటనను విడుదల చేసినట్టు వివరించింది.

దేశంలో నాలుగు రకాల పార్టీలు, నాలుగు రకాల పరిపాలన, రాజకీయ సంస్కృతులు ఉన్నాయని మోదీ వివరించారు. మొదటిది ‘నాంపంతి’ (వంశీయులు), రెండవది ‘వాంపంతి ‘, మూడవది ‘దమన్ మరియు దాంపంతి’ మరియు నాలుగవది ‘వికాస్ పంతి’.  వికాస్ పంతి మా పరిపాలన విధానం అని మోదీ తెలిపారు.