సీఏఏ నేపథ్యంలో.. 80 మంది ముస్లిం నేతల రాజీనామా!

| Edited By:

Jan 24, 2020 | 10:26 PM

పౌరసత్వం (సవరణ) చట్టాన్ని నిరసిస్తూ మధ్యప్రదేశ్‌లోని బిజెపికి చెందిన 80 మంది ముస్లిం నాయకులు శుక్రవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకే సీఏఏను తీసుకొచ్చారని వారు ఆరోపించారు. సీఏఏ ఇప్పటికే అమల్లోకి రావడంతో తమ మతానికి చెందిన కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశాన్ని విభజించే చర్య […]

సీఏఏ నేపథ్యంలో.. 80 మంది ముస్లిం నేతల రాజీనామా!
Follow us on

పౌరసత్వం (సవరణ) చట్టాన్ని నిరసిస్తూ మధ్యప్రదేశ్‌లోని బిజెపికి చెందిన 80 మంది ముస్లిం నాయకులు శుక్రవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకే సీఏఏను తీసుకొచ్చారని వారు ఆరోపించారు. సీఏఏ ఇప్పటికే అమల్లోకి రావడంతో తమ మతానికి చెందిన కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది దేశాన్ని విభజించే చర్య అని, రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని వారు వివరించారు. సీఏఏ లాంటి విభజన చట్టాలపై ఇంకా ఎంతకాలం మౌనంగా ఉండాలని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారన్నారు. శరణార్థులు ఏ మతం వారైనా భారత పౌరసత్వం ఇవ్వాల్సిందేనని, కానీ మతం ఆధారంగా వారు ఉగ్రవాదులా? చొరబాటుదారులా? అనేది ఎలా నిర్ణయిస్తారని వారు ప్రశ్నించారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఆయనను ప్రశ్నించినప్పుడు రాజీనామాల విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు.