ప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో అనారోగ్యానికి గురైన ఆవుకు శస్త్ర చికిత్స చేశారు పుశు వైద్యులు. ఆవు పొట్టలో నుంచి సుమారు 80 కిలోల వ్యర్థాలు బయటకు తీశారు. హైదరాబాద్ అమీన్పూర్ మండల పశువైద్యాధికారి డాక్టర్ విశ్వ చైతన్య ఈ ఆపరేషన్ చేశారు. జిహెచ్ఎంసి పరిధిలో రోడ్లపై తిరిగే రెండు ఆవులు ఆహారం తీసుకోకుండా అనారోగ్యంతో కనిపించడంతో… ఇరవై రోజుల క్రితం బీరంగూడలోని గోశాలకు తీసుకువచ్చారు. పొట్టలో ప్లాస్టిక్ వ్యర్థాలు వల్ల అవి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ రెండు ఆవుల్లో ఒకటి మూడు రోజుల క్రితం చనిపోయింది.