AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్‌ కంతలో నక్కిన పాము..పదేళ్ల చిన్నారిపై కాటు

కేరళలో విషాద సంఘటన చోటు చేసుకుంది. స్కూల్‌ సిబ్బంది, క్లాస్‌ టీచర్‌ నిర్లక్ష్యంతో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వైనాడ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సుల్తాన్‌ బథేరీలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న షెరిన్‌ అనే బాలిక ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి బలైపోయింది. తరగతి గదిలోని ఓ గోడకు గతంలో ఎప్పుడో ఒక గుంత ఏర్పడింది. ఆ గుంతను ఎవరూ పట్టించుకోకపోవడంతో అది చాలాకాలంగా అలాగే ఉండిపోయింది. దీంతో అందులో […]

స్కూల్‌ కంతలో నక్కిన పాము..పదేళ్ల చిన్నారిపై కాటు
Pardhasaradhi Peri
| Edited By: Nikhil|

Updated on: Nov 22, 2019 | 4:11 PM

Share

కేరళలో విషాద సంఘటన చోటు చేసుకుంది. స్కూల్‌ సిబ్బంది, క్లాస్‌ టీచర్‌ నిర్లక్ష్యంతో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వైనాడ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సుల్తాన్‌ బథేరీలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న షెరిన్‌ అనే బాలిక ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి బలైపోయింది. తరగతి గదిలోని ఓ గోడకు గతంలో ఎప్పుడో ఒక గుంత ఏర్పడింది. ఆ గుంతను ఎవరూ పట్టించుకోకపోవడంతో అది చాలాకాలంగా అలాగే ఉండిపోయింది. దీంతో అందులో విష సర్పాలు, క్రిమికీటకాలు ఆవాసం ఏర్పరచున్నాయి. అది ఎవరూ గమనించకపోవడంతో…షెరిన్‌ నడుస్తూ పొరపాటున అందులో కాలు పెట్టింది. కాలు గుంతలోకి వెళ్లింది. బయటికి తీయగా, కాలుపై రెండు గాట్లు కనిపించాయి. కొందరు విద్యార్థులు అవి పాము కాట్లు అని చెప్పినా, స్కూల్‌ సిబ్బంది మాత్రం పెచ్చుల వల్ల గాయాలయ్యాయని భావించారు. దీంతో ఆ బాలికను ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యమైంది. అంతలో షెరిన్‌ అపస్మారక స్థితిలోకి పడిపోవడం గమనించిన టీచర్లు..హుటాహుటినా ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే షెరిన్‌ పరిస్థితి విషమంగా మారటంతో కోజికోడ్‌ కాలేజీకి తరలించారు. అయినా ఫలితం లేకపోవడంతో… చికిత్స పొందుతూ చివరకు షెరిన్‌ మృతిచెందింది. తమ బిడ్డ మృతికి స్కూల్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. క్లాస్‌రూమ్‌లో అంతపెద్ద గొయ్యి ఏర్పడినా ఎందుకు పట్టించుకోలేదని సిబ్బంది తీరుపై మండిపడ్డారు.