కరోనా ఎఫెక్ట్ : ఇటలీలో రాజకీయ గందరగోళం.. రాజీనామా చేయనున్న ప్రధాని గిసెప్పే కాంటే
ఇటలీ ప్రధాని గిసెప్పే కాంటే సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాంటే ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
Italian PM Giuseppe Will Resign : ఇటలీ ప్రధాని గిసెప్పే కాంటే సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాంటే ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటరేల్లాకు తన రాజీనామాను సమర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
బలమైన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే కాంటే రాజీనామా చేసినట్లు సమాచారం. 15 నెలల పాటు కేంద్ర-వామపక్ష కూటమిని నడిపించారు కాంటే. అంతకుముందు మాట్టెయో సాల్విని నేతృత్వంలోని మితవాద పార్టీతో జట్టుకట్టి 15 నెలలు అధికారంలో కాంటే ఉన్నారు. సాల్విని మద్దతు ఉపసంహరించుకోవడంతో తొలిసారి ప్రభుత్వం కూలిపోయింది.
గతవారం పార్లమెంట్లో జరిగిన విశ్వాస పరీక్షలో కాంటేకు రెండు ఓట్లు దక్కాయి. తన కూటమి భాగస్వామి, మాజీ ప్రధాని మాట్టెయో ఫిరాయింపుతో సెనేట్లో మెజారిటీ కోల్పోయారు. దీంతో కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఇటలీలో.. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రభావం పడింది.
కాంటే రాజీనామా ఆమోదించి, బలమైన కూటమిని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు సెర్గియో సూచించే అవకాశం ఉంది. లేదా పార్లమెంట్ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
Casual Racism : ఒకే చోట ఉన్నా.. రెండు పద్ధతులు..! ఆస్ట్రేలియాలో మా క్వారంటైన్ ఎలా సాగిందంటే..!
పేపర్ లెస్ బడ్జెట్ సామాన్యులు తెలుసుకునేలా కేంద్రం కొత్త యాప్.. ఇందులోని ప్రత్యేకతలు ఇవే..