IPL 2020: స్టోక్స్ మెరిసేన్.. రాయల్స్ మురిసేన్..
అబుదాబీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక
IPL 2020: అబుదాబీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్స్ దుమ్ముదులిపింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా పంజాబ్ బ్యాటింగ్కు దిగింది. క్రిస్ గేల్(99) సుడిగాలి ఇన్నింగ్స్తో ఆ జట్టు 20 ఓవర్లలో 185/4 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత 186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 186/3 పరుగులు సాధించి గెలుపొందింది. రాజస్థాన్ బ్యాట్స్మెన్లో బెన్ స్టోక్స్(50) మెరుపు అర్ధ శతకంతో విజృంభించగా, శాంసన్(48), ఉతప్ప(30), స్మిత్(31), బట్లర్(22)లు రాణించారు.
That’s that from Match 50.@rajasthanroyals WIN by 7 wickets.#Dream11IPL pic.twitter.com/ILJXeG6JRm
— IndianPremierLeague (@IPL) October 30, 2020