కోల్‌కతాను దెబ్బతీసిన సిరాజ్.. బెంగళూరుకు స్వల్ప లక్ష్యం

|

Oct 21, 2020 | 9:50 PM

ఐపీఎల్‌-13లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ దారుణంగా సాగింది. పేసర్ మహ్మద్‌ సిరాజ్‌, స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ దెబ్బకు కోల్‌కతా వణికిపోయింది.

కోల్‌కతాను దెబ్బతీసిన సిరాజ్.. బెంగళూరుకు స్వల్ప లక్ష్యం
Follow us on

RCB need 85 runs to win : ఐపీఎల్‌-13లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ దారుణంగా సాగింది. పేసర్ మహ్మద్‌ సిరాజ్‌, స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ దెబ్బకు కోల్‌కతా వణికిపోయింది. వీరిద్దరి ధాటికి కోల్‌కతా ఓ దశలో 40 పరుగులకే ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ దారిపట్టారు. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఆదుకోవడంతో బెంగళూరుకు కోల్‌కతా 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితమైంది. 2020 సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు.