Strain Virus: భారత్లో పెరుగుతున్న స్ట్రెయిన్.. 109కి చేరిన కేసులు.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్రం
Strain Virus: ఒక వైపు కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడకముందే మరో వైపు స్ట్రెయిన్ వైరస్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. యూకేలో మొదలైన ఈ స్ట్రెయిన్...

Strain Virus: ఒక వైపు కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడకముందే మరో వైపు స్ట్రెయిన్ వైరస్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. యూకేలో మొదలైన ఈ స్ట్రెయిన్ వైరస్ ఇతర దేశాలన్నింటికి వ్యాపిస్తోంది. ఇక భారత్లో కొత్త రకం కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఈ కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ కేసుల సంఖ్య 109కు చేరినట్లు తెలిపింది. జనవరి 11న 96 ఉండగా, 13న 102కి చేరాయి. గురువారం నాటికి వీటి సంఖ్య 109కి చేరాయి. అయితే పాజిటివ్ వచ్చిన వారిని ఆయా రాష్ట్రాల్లో ఒక్కో గదిలో ఐసోలేషన్లో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. వారితో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్లో ఉంచినట్లు పేర్కొంది. అయితే మరి కొందరు ప్రయాణికులు, వారిని కలిసిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వీరి నమూనాలపై జన్యుపరీక్షలు చేస్తున్నామని తెలిపింది.
ఈ స్ట్రెయిన్ వైరస్ విషయంలో రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నామని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. దీనిపై పర్యవేక్షణ, పరీక్షలు చేయడం, శాంపిళ్లను ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సోర్టియం ల్యాబ్లకు పంపడంలో రాష్ట్రాలకు కేంద్రం సహకారం అందిస్తుందని వివరించింది.
ఈ యూకే స్ట్రెయిన్ వైరస్ భారత్తో పాటు జపాన్, కెనడా, జర్మనీ, బెబనాన్, సింగపూర్, డెన్మార్క్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్లకు కూడా వ్యాపించింది. సాధారణ కరోనా వైరస్ కంటే త్వరితంగా వ్యాప్తి చెందే ఈ యూకే స్ట్రెయిన్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం సూచిస్తోంది.