ఒకే రోజు.. ఒకే ప్రాంతం.. గుండెపోటుతో ముగ్గురు యువకుల దుర్మరణం.. భయాందోళనల్లో జనం!

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు యువకులు గుండెపోటుతో మరణించడం సంచలనం సృష్టించింది. ఫరీద్‌పూర్, అల్లిపూర్ మరియు బంకట గ్రామాల్లో జరిగిన ఈ మరణాలు ఆయా కుటుంబాలలో విషాదాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలలో భయాందోళనలను కలిగించాయి. మృతుల్లో ఢిల్లీలో ఎస్‌డిఓగా పనిచేస్తున్న చంద్రేష్ పాల్, అయోధ్యలో కార్మికుడిగా పనిచేస్తున్న దీపు కుమార్, అజంగఢ్‌లో ఒక వివాహానికి హాజరు కావడానికి వెళ్లిన అనుజ్ కుమార్ ఉన్నారు.

ఒకే రోజు.. ఒకే ప్రాంతం.. గుండెపోటుతో ముగ్గురు యువకుల దుర్మరణం.. భయాందోళనల్లో జనం!
Triple Heart Attack

Updated on: May 15, 2025 | 11:07 AM

ఉత్తరప్రదేశ్‌లో గుండెపోటు కారణంగా సంభవించిన మరణాలు సంచలనం సృష్టించాయి. ని అంబేద్కర్ నగర్‌ జిల్లాలోని రాజేష్‌స్థాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు గుండెపోటుతో మరణించారు. మృతుల్లో జిల్లాలోని ఫరీద్‌పూర్ హెతారియా గ్రామానికి చెందిన చంద్రేష్ పాల్ (40), అల్లిపూర్ బార్జీ గ్రామానికి చెందిన దీపు కుమార్ (30), అనుజ్ కుమార్ (24) ఉన్నారు. ఈ ఆకస్మిక మరణాలు కుటుంబ సభ్యులలో కలకలం రేపాయి. చుట్టుపక్కల ప్రాంతాలలో భయాందోళనలు నెలకొన్నాయి.

మరణించిన చంద్రేష్ పాల్ ఢిల్లీలోని రోహిణి నగర్‌లో నివసించారు. అతను టెలికాం డిపార్ట్‌మెంట్‌లో SDOగా పనిచేస్తున్నాడు. ఉదయం వాష్‌రూమ్‌కు వెళ్లిన చంద్రేష్ కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతని మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అందులో అతని మరణానికి కారణం గుండెపోటు అని తేలింది. ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోనే జరిగాయి. మృతుడికి భార్య అర్చన, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రెండేళ్ల కూతురు ఉన్నారు.

రెండవ సంఘటన దీపు కుమార్ అయోధ్యలో నివసిస్తున్నప్పుడు కూలీగా పనిచేసేవాడు. రాత్రి 10 గంటలకు ఆకస్మిక అనారోగ్యం కారణంగా ఆయన మరణించారు. అతని కుటుంబంలో అతని భార్య వందన, మూడేళ్ల కుమార్తె అన్నయ ఉన్నారు. దీపు మరణంతో ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబంలో జీవనోపాధి భారం కానుంది. దీపు తండ్రి 15 సంవత్సరాల క్రితం మరణించాడు. కుటుంబం మొత్తం బాధ్యత దీపు భుజాలపై ఉంది. కొడుకు మరణాన్ని తట్టుకోలేక మృతుడి తల్లి షీలా దేవి స్పృహ కోల్పోయారు.

మూడవ సంఘటనలో, బంకట బుజుర్గ్ గ్రామానికి చెందిన అనుజ్ కుమార్, వివాహ ఊరేగింపులో పొరుగు జిల్లా అజంగఢ్‌లోని హుసాపూర్ గ్రామానికి వెళ్ళాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో పెళ్లి ఊరేగింపులో అతనికి ఛాతీ నొప్పి వచ్చి ఆసుపత్రికి తరలిస్తుండగా అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ సభ్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి భార్య మాల్తి, తల్లి అనిత అనుజ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అనుజ్ కి 3 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అతనికి ఒక సంవత్సరం వయసున్న కుమారుడు శ్రీషభ్ ఉన్నాడు. దీపు కూలీగా పనిచేస్తూ తన కుటుంబ ఖర్చులను ఎలాగోలా నిర్వహించుకునేవాడు. అనుజ్ మరణం ఆ కుటుంబాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..